Monday, July 4, 2016

స్నేహం కోసం.. ప్రాణం ఇచ్చాడు


ఉగ్రవాదులు వెళ్లిపొమ్మని చెప్పినా కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్ల కోసం అక్కడే ఉండి ఓ బంగ్లాదేశ్‌ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 20ఏళ్ల ఫరాజ్‌ ఆయాజ్‌ హొస్సైన్‌ అనే బంగ్లాదేశీ విద్యార్థిని ఇప్పుడు సోషల్‌ మీడియాలో హీరో అని పొగుడుతున్నారు. ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తనతో పాటు వచ్చిన స్నేహితురాళ్లను వదిలేసి వెళ్లకుండా ఫరాజ్‌ అక్కడే ఉన్నాడని ఇటీవల ఢాకాలోని రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి మీడియాకు వెళ్లడించారు. ఫరాజ్‌ స్నేహితురాళ్లలో భారతీయ యువతి తరుషి కూడా ఉంది.
ఫరాజ్‌ అమెరికాలోని ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వేసవి సెలవులకు అతడు బంగ్లాదేశ్‌ వచ్చాడు. సెలవులకు వచ్చిన తన స్నేహితురాళ్లు ఎమ్రోయ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అమెరికాకు చెందిన అబింతా కబిర్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని తరుషి జైన్‌తో కలిసి దాడి జరిగిన రెస్టారెంట్‌కు వెళ్లారు. ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నవారిలో ఈ ముగ్గురు ఉన్నారు. ఉగ్రవాదులు బంగ్లాదేశ్‌ వారిని వదిలేసి.. విదేశీయులను మాత్రమే హతమార్చారు. అయితే ఫరాజ్‌ను వెళ్లిపొమ్మని చెప్పినా.. తన స్నేహితురాళ్లను వదిలేస్తే వెళ్తానని.. లేదంటే వెళ్లనని చెప్పడంతో ఉగ్రవాదులు అతడిని కూడా చంపేశారు. గత వారం ఢాకాలో ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడి చేసి 20 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే. భద్రతాసిబ్బంది దాడుల్లో ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.

No comments:

Post a Comment