Sunday, July 3, 2016

నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు..

6
తనకు మగ మిత్రులే లేరంటోంది నటి లావణ్యత్రిపాఠి. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? ఈ మధ్య కథానాయికలు ఏమి చెప్పినా అవునా? నిజమా? అనుకునే పరిస్థితి నెలకొంది. లావణ్య త్రిపాఠి మాటల్ని అలానే అనుకుందాం బ్రహ్మన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఓకే అన్నా ఈ అమ్మడిని మాత్రం చిత్ర పరిశ్రమ నోనో అన్నదనే చెప్పాలి.అయితే చిన్న గ్యాప్ తరువాత లావణ్య త్రిపాఠి ప్రయత్నాలు టాలీవుడ్‌లో ఫలించాయి.

అక్కడ కుర్ర హీరోలతో నటించిన చిత్రాలు మంచి విజయాలను పొందడంతో తాజాగా కోలీవుడ్‌లో ఒక అవకాశం వచ్చింది. నిర్మాత సీవీ.కుమార్ దర్శకుడిగా మోగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న మాయాన్ చిత్రంలో లావణ్యత్రిపాఠిని నాయకిగా ఎంచుకున్నారు.ఈ చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్న ఈ బ్యూటీని పలకరించగా మాయాన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని తెలిపింది.

ఇందులో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. తెలుగు, తమిళ భాషల్లో నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని అంది. కమర్శియల్ కథా చిత్రాలకు, ప్రేమ కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ ఉంటోందని చిప్పింది. ఇక నటన విషయానికి వస్తే ఏ భాషలోనైనా ఒకటేనని పేర్కొంది. తనకు మాత్రం అన్ని భాషల్లోనూ నటించాలని ఆశ అని అంది. అదే విధంగా తానెవరినీ పోటీగా భావించడం లేదని చెప్పింది.

అనుష్క, సమంత, నిత్యామీనన్‌ల నటనంటే తనకు ఇష్టం అని చెప్పింది. ప్రేమలో పడ్డారా? అని చాలా మంది అడుగుతున్నారని, తానెవరినీ ప్రేమించలేదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తనకు మగ మిత్రులే లేరనీ అంది. ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చానని, తన దృష్టి అంతా నటనపైనేనని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఈ జాన నటనానుభవం ఏమీ తక్కువకాదు. దశాబ్దం పూర్తి చేసుకుంది. తను నటించిన బ్రహ్మన్ చిత్రం 2006లో విడుదలైందన్నది గమనార్హం.

No comments:

Post a Comment