Wednesday, January 20, 2016

ఆసీస్‌తో నాలుగో వన్డేలోనూ భారత్‌ ఓటమి

ధావన్‌, కోహ్లి శతకాలు వృథా
సిరీస్‌ 4-0తో ఆసీస్‌ ఆదిక్యం
రిచర్డ్‌సన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ఎంపికయ్యాడు



భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 348 పరుగులు చేసింది. భారీ లక్ష్య చేధనలో దూ
కుడుగా ఆరంభించిన భారత్‌ 49.2 ఓవర్లలో 323 పరుగులకు అలౌట్‌ అయ్యింది. రోహిత్‌ శర్మ 25 బంతులల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు సహయంతో 41 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా కోహ్లి వచ్చాడు. దావన్‌, కోహ్లీ రెండో వికెట్లు 212 పరుగులు భాగ్యస్వామం నెలకొల్పారు. ఇద్దరు సెంచరీలతో కదం తోక్యారు. శిఖర్‌ ధావన్‌ 113 బంతులల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ 92 బంతులల్లో 11 పోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు చేశారు. వీరిద్దరు దూకుడు అడుతుంటే మ్యాచ్‌ అవలోకగా గేలుస్తుందని బావించారు. కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది. ధావన్‌ అవుట్‌ అయినా తరువాత భారత్‌ బ్యాటింగ్‌ తడబడుతు వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో నిలిచింది. కెప్టెన్‌ ధోఁ (0), గురకీరత్‌ ( 5), రహనే (2), రిషి ధావన్‌ ( 9), భువనేశ్వర్‌ (2), ఉమేష్‌ యాదవ్‌ (2), ఇషాత్‌ శర్మ (0) రెండంకెల స్కోరు కూడ చేయలేక పెవిలియకు క్యూ కట్టారు. చివరిగా జడేజా (24) అజేయంగా నిలిచిన జట్టును గెలిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్‌ 5, హెస్టింగ్‌ 2, మార్ష్‌ 2, లియాన్‌ ఒక వికెటు లభించింది.
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచు
కుది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌, డెవిడ్‌ వార్నర్‌ తొలి వికెటుకు ఏకంగా 187 పరుగుల బ్యాగస్వామం చేశారు. ఆరోన్‌ ఫించ్‌ 107 బంతులల్లో 9 పోర్లు, 2 సిక్స్‌లతో 107 పరుగులు చేశారు. మరో ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ 92 బంతులల్లో 12 పోర్లు, 1 సిక్స్‌తో 93 పరుగులు చేసి సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కేవలం 29 బంతులల్లో 4 పోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. మిచెల్‌ మార్స్‌ (33), బెయిల్‌ (10), ఫాల్కనర్‌ (0), వెడ్‌ (0) పరుగులు చేశారు. చివరిలో మాక్స్‌వెల్‌ 20 బంతుల్లో 6 పోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేశారు. బారత్‌ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 4, ఉమేష్‌ యాదవ్‌ 3 వికెట్లు తీశారు.

No comments:

Post a Comment