తెలగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం. కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా.ఇటీవల అక్కినేని నాగార్జునతో ' రగడ ' చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ' అష్టలక్ష్మీ ' పాత్ర తనకెంతో పేరు తెచ్చి పెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ '' నాగ్తో పుల్లెంగ్త్ హీరోయిన్గా నటించాలన్న నా కోరిక ' రగడ'తో తీరింది. ఆయనతో నాటించడం ఎంతో కంపర్టబుల్గా వుంటుంది. మళ్ళీ నాగ్తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ' రగడ' చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్తో ' రాజ్' చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ాద్దరు హీరోలతో నటించాను.ఇక బ్యాలెన్స్గా వున్న ' నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది. '' అంటూ ముసిముసిగా నవ్యుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరుఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్తో కలిసి నటిస్తున్నారు. అప్పుడు మీ మధ్య కాంపిటీషన్ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ' ప్రతి హీరోయిన్తోనూ నాకు మంచి సంబంధమే వుంది.
No comments:
Post a Comment