Sunday, January 30, 2011

నేడే తేలుస్తాం ..

షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 27న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌ కోల్‌కత్తా ( ఈడెన్‌) లోనే జరుగుతుందా ? లేదంటే.. మరో వేదికలోనా ? దీనిపై నిర్ణయం ఆదివారమే వెలవడనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి అధ్యక్షుడు శరద్‌ పవారే స్వయంగా ప్రకటించారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో ఓవరాల్‌గా 4 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. వీటిలో భారత్‌- ఇంగ్లాండ్‌ ‌ మధ్య జరగాల్సిన మ్యాచే ఆ వేదికన తొలి వన్డే అయితే .. అప్పటికే ఆ స్డేడియం మరమ్యమతు పనులు పూర్తి ఆయ్యే పరిస్థితిలేదని ఈడెన్‌ నుంచి తరలిపోయిన వన్డేకు బెంగుళూరు ఆతిథ్యం ాచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుందని శరద్‌ పవార్‌ ఇప్పటికే తేల్చేశాడు.

No comments:

Post a Comment