Saturday, December 17, 2011

ధోనికి సిఎన్‌ఎన్‌ - ఐబిఎన్‌ అవార్డు

ఈ సంవత్సరం క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలుచుకున్నప్పుడు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఎంతగా భావోద్వేగానికి గుర య్యాడంటే ఫైనల్‌ మ్యాచ్‌ తరువాత జట్టు సహచరులతో పాటు అతను కూ డా ఏడ్చే శాడు. ‘ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం క్రీడాకారులందరూ ఏడ్చేశారు. నేనూ ఏడ్చాను. అయితే, ఆ ఫుటేజ్‌ ఎక్కడా లేదు. ప్రపంచ కప్‌ గెలుచుకోవాలన్నది మా అందరి కల అయినందున భావోద్వేగాలను అణచు కోవడం చాలా కష్టమైంది’ అని ధోని చెప్పా డు. శుక్రవారం రాత్రి ధోనికి ‘సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ స్పోర్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించారు.

ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్ట్‌ సీరీస్‌ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లే ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ధోని ఈ విషయం తెలియజేశాడు. ‘నేను ఏడ్చేశాను. నేను తలెత్తి చూస్తే తక్కిన క్రీడాకారులు నా చుట్టూ చేరారు. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌కు పరుగెత్తాను. అని ధోని తెలిపాడు.ఈ అవార్డుకు ఇతర నామి నీలలో క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, ఆర్చర్‌ దీపికా కుమారి, షూటర్‌ రంజన్‌ సోధి, బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌, బ్యాడ్మింటన్‌ జోడి జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప ఉన్నారు. సోధికి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ప్ర త్యేక ఘనత అవార్డులు ప్రదానం చేశారు.

No comments:

Post a Comment