సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన ‘బావ’ చిత్రం ద్వారా కన్నడ భామ ప్రణీత తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంతో తెలుగులో ఓ వెలుగు వెలగాలనుకున్న ఈ భామకు ‘బావ’ చేదు అనుభవాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. దీంతో తన దృష్టిని తమిళ చిత్రాల వైపు మళ్ళించిన ప్రణీత ప్రస్తుతం తమిళ్లో ‘యుగానికి ఒక్కడు’,‘ఆవారా’ చిత్రాల హీరో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ‘ షగుణి’ లో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంటే ప్రణీతకు దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ రూపంలో మరో లక్కీఛాన్స్ లభించిందని కోలీవుడ్ సమాచారం. క్రేజీ హీరో విజయ్ కథానాయకుడిగా ఎ.ఆర్.మురుగదాస్ తమిళ్లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే విజయ్కి జోడీగా ప్రణీతని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘బావ’ చిత్రంతో తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని ఆశపడి భంగపడ్డ ప్రణీతకు తమిళ్లో వరుసగా భారీ చిత్రాల్లో క్రేజీ స్టార్స్తో నటించే అవకాశం వస్తుండటంతో ఇక ఆమె స్టార్ తిరిగిన తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.
No comments:
Post a Comment