Wednesday, April 13, 2011

ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్‌ కైవసం

 ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3-0 తేడాతో గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 361 పరుగులు చేసింది. ఓపెనరు వాట్సన్‌, రిక్‌పాటింగ్‌ వచ్చారు. వాట్సన్‌ 40 బంతులలో 72 పరుగులు చేశారు. పాటింగ్‌ మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ అతను కూడా మూడు పరుగుల తేడాతో అర్థ సెంచరీ మిస్‌ అయ్యాడు. స్మిత్‌ 5 పరుగులు చేశాడు. హుస్సీ 91 బంతులలో 108 పరుగులు చేశాడు. జాన్నస్‌ 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ 362 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనరు తమిమ్‌ ఇక్‌బాల్‌ 17 బంతులలో 32 పరుగులు చేశాడు. మరో ఓపెనరు క్యాయుస్స్‌ 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. (93) నఫీస్‌ 60, మహ్మదుల్లా 68, పరుగులు చేశారు. మిగిలినా బ్యాట్స్‌మైన్‌లు తక్కువ స్కోరు అవుట్‌ అయ్యాడు. మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ హుస్సీ, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ వాట్సన్‌.

No comments:

Post a Comment