పాక్స్థాన్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ 11 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 50 ఓవర్లలో 277 పరుగుల చేసింది. పాక్ బ్యాట్మైన్లు మిస్బావుల్ హక్ ,యూనిస్ ఖాన్ ఇద్దరు రాణిచండంతో పాక్ 277 పరగులు చేసింది. కమ్రాన్ అక్మల్ 39, హఫీజ్ 32 పరుగులు చేశారు. కెప్టెన్ షాహిద్ అఫ్రిద్ 12 బంతులలో 16 పరుగులు చేశాడు. అతడు బ్యాటింగ్ కన్నా బౌలింగ్కు ఎకువ ప్రాదన్యత వహిస్తున్నారు. అంతక ముందు మ్యాచ్లో కూడా బౌలింగ్లో నాలుగు వికెట్లు తీసుకఁన్నాడు. ఇప్పుడు జరిగినా మ్యాచ్లో నాలుగు కీలక వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన లంక ఓపెనర్లు ఇద్దరు తరంగ 33, దిల్షాన్ 41 పరుగులు చేశారు. వీరిద్దరు మొదటి వికెట్టుకు 71 పరుగుల భాగ్యస్వామ చేశారు. వన్డౌన్గా వచ్చిన కెప్టెన్ 49 పరుగుల చేసి అఫ్రీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికైనా లంక వైపు మ్యాచ్ ఉంది. ఒక్కసారిగా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ పాక్ దిశగా నడిచింది.జయవర్థన్, సమరవీర ఇద్దరు తకువ స్కోరుకే అవుట్ అయ్యారు. అతరువాత వచ్చిన మాథ్యుస్, స్లిల్వా ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరు మంచిగా అడుతున్న సమయంలో మ్యాథ్యూస్ను అఫ్రిద్ అవుట్ చేశాడు. చివరిలో కఁలశేఖర్ 14 బంతులో 24 పరుగులు చేసి పాక్ భయం పుట్టించాడు. చివరికి పాక్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
No comments:
Post a Comment