Saturday, January 29, 2011

కెప్టెన్‌ వెంకి

 సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ ( సీసీఎల్‌ ) మ్యాచ్‌ అటు దక్షిణాది, ఇటు  ఉత్తరాది తారాగణంతో జరుగనుంది. టాలీవుడ్‌ జట్టుకు వెంకటేష్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ తరపున ఈ జట్టు ఓనర్‌గా మంచు విష్ణు వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 14 లోపు ఈ జట్టులో ఎవరెవరు ఆడతారో నిర్ణయిస్తామని, ఆ టీం ఆవిష్కరణ కార్యక్రమం జరపగానికి సన్నాహాలు చేస్తున్నామని శనివారంనాడు మంచి విష్ణు విలేకరులకు తెలియజేశారు. జట్టుకు ప్రచార కర్తలుగా తాప్సీ, సమంత వ్యవహరిస్తున్నారు. కన్నడ జట్టుకు పునీత్‌ రాజ్‌కుమార్‌, హిందీ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్‌ఖాన్‌ వ్యవహరిస్తున్నారు.


No comments:

Post a Comment