Thursday, January 27, 2011

సినిమాల సందడి

 గగనం, అమెరికా అల్లుడు, వస్తాడు నా రాజు, అప్పల్రాజు, జై బోలో తెలంగాణ ాలా నాలుగు సినిమాలు వారి అభ్రిపాయాలు.
వివిదాస్పందంగా మారిన చిత్రం ' జై బోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు.
నాగార్జున నటించిన ' గగనం ' చిత్రం ఫిబ్రవరి రెండో వారానికి విడుదల సిద్దమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు దిల్‌రాజ్‌, శిరీష్‌, లక్ష్మణ్‌లు తెలియజేస్తున్నారు.
శ్రీకాంత్‌, కామ్నా జెఠ్మలానీ, జెన్నీఫర్‌ కొత్వాల్‌ ప్రధాన పాత్రల్లో ఓం సాయి ప్రకాష్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ' అమెరికా అల్లుడు ' చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై కె. వెంకటరెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్దమైంది. 

సునిల్‌ హీరోగా నటించిన అప్పల్రాజు ఫిబ్రవరి 4న విడుదలకు సిద్దం కానున్నది. అదే రోజు మోహన్‌ బాబు కూమారుడు విష్ణు ' వస్తాడు నారాజు ' చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తూ ఈ స్టార్‌ డైరెక్టర్‌తో సై అంటున్నారు. ' ఢ ' తర్వాత మరో హిట్‌ లేని విష్ణు ' సలీమ్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని చేసిన ఈ చిత్రంపై అచంచల నమ్మకంతో ఉన్నాడు. ' మర్యాద రామన్న ' తర్వాత సునిల్‌, స్వాతి కాంబినేషనల్‌లో వస్తున్న అప్పల్రాజు ఫిబ్రవరి 4న వచ్చే ఏర్పాటు చేస్తున్నారు.

1 comment:

  1. వీటన్నింటిలో
    న భూతో న భవిష్యతి అన్న రీతిలో
    చరిత్ర సృష్టించ బోతున్న సినిమా
    "జై బోలో తెలంగాణా "

    ReplyDelete