Thursday, January 27, 2011

' జై బోలో తెలంగాణ ' సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌

వివాదాస్పదంగా మారిన చిత్రం ' జైబోలో తెలంగాణ ' కు సెన్సార్‌ బోర్డు అనుమతి లభించింది. ఫిబ్రవరి 4న సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాత ఎస్‌. శంకర్‌ ప్రకటించాడు. సెన్నార్‌ బోర్డ్‌లో కొందరు సీమాంధ్రులు సినిమా విడుదలకు అడ్డుకట్ట వేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లవెత్తడం సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా ' జై బోలో తెలంగాణ ' సినిమాకి సెన్సార్‌ ాబ్బందులు ఎదురయిన సంగతి విదితమే. దీంతో ' జై బోలో తెలంగాణ ' సినిమా విడుదలకు మార్గం సుగమమయింది.

No comments:

Post a Comment