<b>మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ లభించింది.</b>
ఇక్కడ జరిగిన ఏకైక ట్వంటీ- 20 మ్యాచ్లో దణాఫ్రికాపై భారత్ 21 తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షాణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను వాన్విక్ దాటిగా ప్రారంభించాడు. ఐదు ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 50 పరుగులు చేసింది. ఒక్క పక్క వికెట్లు పడుతుండగానే తన అర్థసెంచరీని పూర్తి చేశారు. ఆమ్లా 1, ఇంగ్రామ్ 2, డివిల్లియర్స్ 14, డుమినీ 0, పానెల్ 14, మిల్లర్ 10, బోథా 25, పరుగులు చేసి అవుట్ అయ్యారు. థీయర్ 1 , ఎన్తిన్ 1 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. భారత్ బౌలింగ్లో నెహ్రా, యూసుప్ పఠాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్ , అశ్విన్ , యువరాజ్ సింగ్ తలో వికెట్టు తీసుకున్నారు. అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 53, రైనా 41, కోహ్లీ 28, విజరు 14, యువరాజ్ సింగ్ 12, ధోనీ 10, పఠాన్ 6 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మ లభించింది.
No comments:
Post a Comment