Sunday, October 24, 2010

గోవా వన్డే రద్దు

 అనుకున్న దంతా అయింది. వర్షం భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం నాడిక్కడ జరగాల్సిన మూడవ, చివరి వన్డేను బలి తీసుకుంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం కార ణంగా నెహ్రూ స్టేడియం మైదానం తడిసి ముద్దవడంతో మ్యాచ్‌ ఆడే పరిస్థితి లేదని అంపైర్లు బిల్లీ బౌడెన్‌, అమిష్‌ సహేబా నిర్ణయించారు. మధ్యాహ్నం 12.15 నిమి షాలకు మైదానాన్ని పరీక్షించిన అంపైర్లు ఒంటి గంటకు ఈ నిర్ణయానికి వచ్చారు. గోవా వన్డే మ్యాచ్‌ రద్దు కావడంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకుంది. టెస్టు సిరీస్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయిన ఆసీస్‌ భారత్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండా రిక్తహస్తాలతో స్వదేశం తిరిగి ప్రయాణమైంది.

No comments:

Post a Comment