Thursday, July 6, 2017

అప్పుడు ‘ఈగ’ ఇప్పుడు ‘చేప’?

 నాని కథానాయకుడిగా నటించిన ‘ఈగ’ చిత్రాన్ని ప్రేక్షకులకు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఓ చేప నేపథ్యంలో సినిమా రాబోతోంది.
అది కూడా నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రశాంత్‌ శర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు టాక్‌. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని సైతం రూపొందించారట. అయితే ఈగ సినిమాలోలాగా ఈ సినిమాలోనూ నాని నటిస్తారా లేదా అన్న విషయం మాత్రం తెలీదు.
నాని కథానాయకుడిగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొత్త దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నివేదా థామస్‌ కథానాయిక. ఆది పినిశెట్టి మరో ప్రధాన పాత్రలో కన్పిస్తారు.

No comments:

Post a Comment