Sunday, December 18, 2016

కర్నూలు వెళ్లబోయి కరీంనగర్‌ వెళ్లిన ‘జబర్‌దస్త్‌’ నటి

 నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం గుర్తుందా? అందులో హీరోయిన్‌ కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లమంటే మర్చిపోయి ఎక్కడికో తీసుకెళ్తాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది నటి, వ్యాఖ్యాత రష్మి గౌతమ్‌కు. ‘జబర్‌దస్త్‌’ కార్యక్రమంతో అందరికీ సుపరితురాలైన రష్మి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఆలస్యం రావడంతో అక్కడి ప్రేక్షకులకు ఆమె క్షమాపణలు చెప్పారు. కారు డ్రైవర్‌ను కర్నూలు తీసుకెళ్లమంటే కరీంనగర్‌ తీసుకెళ్లాడని దీంతో కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చానని ప్రేక్షకులకు సారీ చెప్పింది రష్మి. అనంతరం అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పలు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా రష్మిని చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు కష్టాలు పడాల్సి వచ్చింది.

1 comment: