Friday, November 11, 2016

పాత నోట్లతో చెల్లింపులకు గడువు పెంపు



పాత నోట్లతో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపునకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 14వ తేదీ అర్థరాత్రి వరకు పాత రూ.500, 1000 నోట్లతో విద్యుత్‌, నీటి బిల్లులు, ఆస్తిపన్ను, తదితర ప్రజా వినియోగ పన్నులు చెల్లించ వచ్చు. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకే అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ రాత్రి 7గంటల వరకు దాదాపు రూ.40కోట్ల పన్నులు వసూలయ్యాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మరో 72గంటల పాటు గడువు పొడిగించినందున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No comments:

Post a Comment