Tuesday, October 4, 2016

పరుగు ఆపేశా

 ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క... అంటూ ప్రభాస్‌ ‘మిర్చి’లో ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతాడు. కథానాయిక కాజల్‌ కూడా ఇంచుమించు అదే చెబుతోంది. కాకపోతే ఇక్కడ కాజల్‌ చెబుతున్నది సినిమా కోసం కాదు, తన కెరీర్‌ గురించే. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న సీనియర్‌ కథానాయికల్లో కాజల్‌ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణం కోసం మీరు అనుసరించిన వ్యూహాలు ఎలాంటివి? అని అడిగితే... ‘‘కథానాయికగా ఇంత దూరం నేను ప్రయాణం చేయాలని, ఇన్నేళ్లు నటిగా కొనసాగాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. అయినా చిత్రసీమలో వ్యూహాలు, ప్రణాళికలు చెల్లుబాటవుతాయంటే నేను నమ్మను. మనం ఒకటి వూహిస్తే, వాస్తవంలో మరోటి జరుగుతుంటుంది. అందుకే తొలినాళ్లల్లో ఇదే నా చివరి సినిమా అనుకొనేదాన్ని. కొన్నాళ్ల తర్వాత కెరీర్‌పై పట్టు పెరిగింది. వరుసగా అవకాశాలొస్తున్నప్పుడు ఇక దేని గురించీ ఆలోచించే అవసరం రాలేదు. అయితే అంతా సీనియర్‌ కథానాయిక అని పిలుస్తున్నప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యూహం అంటారో, ఇంకేమంటారో తెలియదు కానీ.. ఇక నుంచి మాత్రం కొత్త లెక్కలతో ప్రయాణం చేయాలనుకొంటున్నా. చేసే ప్రతి పాత్ర నటిగా ఆత్మ సంతృప్తినిచ్చేలా ఉండాలనే ఆలోచనతో సినిమాల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఇదివరకటి పరుగుని ఆపేశా. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది కాజల్‌.

No comments:

Post a Comment