Saturday, July 2, 2016

బొద్దుగా ఉండడమే వరమైంది...

‘నా శరీరాకృతి హీరోయిన్‌ కావడానికి సహకరించదేమో అని కొంచెం ఆందోళన పడేదాన్ని. హీరోయిన్‌కు నడుము నాజుకుగా ఉండాలని నిర్మాతలు, దర్శకులు భావించేవారు. నేను బొద్దుగా ఉంటానని నాపై విమర్శలు వచ్చాయి. కానీ అవేవీ నాకు ప్రతిబంధకం కాలేదు’ అంటోంది మాధురీ దీక్షిత్‌. తన అందంతో 1980-90 దశకాలలో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్‌ మాధురి. ఆమె మంచి నాట్యకళాకారిణి కూడా. 1988లో వచ్చిన ‘తేజాబ్‌’ సినిమాలో ‘ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ ఛే సాథ్‌ ఆఠ్‌ నౌ... దస్‌ గ్యారా బారా తేరా’ పాటకు మాధురీ వేసిన స్టెప్పులకు ఆరోజుల్లో యువ ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. అటువంటి మాధురి ఏకంగా ఆరు ఫిలింఫేర్‌ బహుమతులు గెలుచుకోవడమే కాకుండా ‘పద్మశ్రీ’ బిరుదు కూడా సొంతం చేసుకుంది, మాధురీ దీక్షిత్‌ 1999లో కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు శ్రీరాం మాధవ్‌ను వివాహమాడి అక్కడే స్థిరపడింది. ఇప్పుడు మాధురీ మకాం ముంబైకి మార్చివేసింది. నాట్యమంటే అభిమానించే మాధురి ‘డాన్స్‌ విత్‌ మాధురి’ పేరుతో ఆన్‌ లైన్‌ డ్యాన్స్‌ అకాడెమీని నిర్వహిస్తోంది.

No comments:

Post a Comment