మనలో
మనకు నచ్చని విషయాలు చాలానే ఉంటాయి. అవసరం, అవకాశం వచ్చినప్పుడు
వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాం. రాశీ ఖన్నా కూడా అలా
ఎప్పట్నుంచో ఓ విషయంలో మార్పు కోసం ప్రయత్నిస్తోంది. అది ఎంతకీ సాధ్యం
కావడం లేదట. ఇంతకీ అదేంటి? అని ఆరా తీస్తే ‘సిగ్గు’ అని తేలింది. ‘‘చిన్నప్పట్నుంచి
నేను సిగ్గరినే. పెద్దయ్యాకా ఆ విషయంలో మార్పు రాలేదు. కథానాయికని
అయ్యాను కాబట్టి ఇక మెల్లమెల్లగా సిగ్గు, బిడియం లాంటివన్నీ దూరమవుతాయిలే
అని మొదట్లో భావించేదాన్ని. ఇప్పటికీ అది అలాగే ఉంది. నా దర్శకులు నేను
కలలోనూ హించని పాత్రలు సృష్టిస్తున్నారు. వాటిని విన్నప్పుడు ‘ఇంత
సిగ్గరిని, ఈ పాత్రల్లో నేనా? అసలు సాధ్యమేనా?’ అనుకొంటుంటా. దర్శకుల
నమ్మకం చూసి నేనూ ఓకే చెప్పేస్తుంటా. సెట్కి వెళ్లాక నేను ఆ పాత్రల్లో ఒదిగిపోతుంటా.
ఆ క్షణం నాకే కొత్తగా అనిపిస్తుంటుంది. తెరపై నన్ను నేను చూసుకొని ఎంత
ఆశ్చర్యపోతుంటానో మాటల్లో చెప్పలేను తెలుసా?’’ అని చెప్పింది రాశీ ఖన్నా.
ఆమె ప్రస్తుతం రామ్, గోపీచంద్తో కలిసి నటిస్తోంది
No comments:
Post a Comment