Tuesday, May 24, 2016

ఆ ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురుచూపు

 ఒక స్మార్ట్‌ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. తాము త్వరలో విడుదల చేయబోయే ఎం3 నోట్ కోసం రెండు వారాల్లో 3 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మెయిజు ప్రకటించింది. రూ. 9,999 ధరలో ఉన్న ఈ ఫోన్ ఈనెల 31వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...

స్క్రీన్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పి10
సామర్థ్యం: 1.8 గిగాహెర్ట్జ్
ఫోన్ మందం: 5 మిల్లీమీటర్లు
ఓఎస్: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
స్టోరేజి: 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం
అదనపు హంగులు: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి860 జీపీయూ కూడా ఉందట.

No comments:

Post a Comment