Monday, April 4, 2016

ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలు షురూ..

 ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకం మొదలైంది. ఈనెల 16న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతుంది. సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ డాట్‌ ఇన్‌, బుక్‌మైషో డాట్‌ కామ్‌ వైబ్‌సెట్లలో టిక్కెట్లు కొనుక్కోవచ్చు. జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో బాక్స్‌ ఆఫీస్‌, కెఫీ కాఫీ డే ఔట్‌లెట్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఈ నెల 9నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి, పుణె జట్లు తలపడనున్నాయి

No comments:

Post a Comment