Saturday, February 6, 2016

యువీకి షాక్‌.. వాట్సన్‌కి లక్‌

  ఐపీఎల్‌ గత రెండు సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి వేలంలో రారాజుగా వెలుగొందిన భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌కు తాజాగా ఐపీఎల్‌-9 సీజన్‌ వేలంలో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ 2014 సీజన్‌లో యువరాజ్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేయగా.. తర్వాత ఏడాది దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే ఈ రెండు సీజన్లలో యువరాజ్‌ సింగ్‌ పేలవ ఆటతీరుతో ఫ్రాంచైజీలను తీవ్రంగా నిరాశపరిచాడు. శనివారం బెంగళూరులో జరిగిన వేలంలో రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే రూ.7కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంటే గత రెండేళ్లతో పోలిస్తే యువరాజ్‌ ధర దాదాపు సగానికి సగం పడిపోయిందన్నమాట. దాదాపు 351 మంది క్రికెటర్లు శనివారం వేలంలో నిలిచారు.

No comments:

Post a Comment