Sunday, November 1, 2015

సానియా అదరహో...

  భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ టూర్‌లో తన సత్తా చాటింది. మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 6-0, 6-3 తేడాతో 8వ సీడ్ ముగురుజ్జా-సూరేజ్ సవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య 9కి చేరింది. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం వచ్చి చేరింది. సానియా మీర్జాకు తన కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్. హింగిస్‌కు 50వ డబుల్స్ టైటిల్.

No comments:

Post a Comment