Tuesday, October 14, 2014

చిన్నారి గిరిజ చనిపోయింది



రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బోరు బావిలో పడిపోయిన చిన్నారి గిరిజ మృతి చెందిందని మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గిరిజ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ప్రాణాలతో తిరిగి వస్తుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఈ వార్త వినడంతో కుప్పకూలిపోయారు. అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గడిచిన రెండు రోజులుగా రెస్క్యూ టీం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించింది. ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో అడుకుంటున్న గిరిజ (5) ప్రమాదవశాత్తు 60 అడుగులున్న బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని వెలికి తీసేందుకు ప్రోక్లెయ్నిర్లు, సింరేణి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టారు. భూమి లోపల బండరాళ్లు అడ్డు తగిలాయి. దీనితో గ్రిల్స్‌ వేస్తూ చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు 4 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల లోతులో గొయ్యి తవ్వి 8 సిలిండర్ల ఆక్సిజన్‌ పంపించినా ప్రయేజనం లేకపోయింది. అత్యాధునికమైన సిసి కెమెరాల సాయంతో చిన్నారిని గుర్తించారు. ఆమె మృతి చెందిందని చేప్పారు. మృతదేహంపైన మూడు అడుగుల నీరు ఉందని గ్రహించారు.

No comments:

Post a Comment