Wednesday, December 14, 2011

అరడజను సినిమాలు : సమంత

 టాలీవుడ్ ప్రస్తుతం సమంత మాయలో పడిపోయింది. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో తన మాయని మొదలు పెట్టిన సమంత ఈ మధ్య మహేష్‌తో నటించిన ‘దూకుడు’ చిత్రంతో హీరోయిన్‌గా తన జోరు పెంచేసింది. ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు హీరోలనీ తన మాయలో పడేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు తెలుగు చిత్రాలు వుండటం విశేషం. అవి ఎస్8.ఎస్8. రాజమౌళి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈగ’, గౌతమ్‌మీనన్ మూడు బాషల్లో నిర్మిస్తున్న ‘నిత్య’, నాగచైతన్యతో దేవాకట్టా తెరకెక్కిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’, దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అలాగే రామ్‌చరణ్‌తో వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘ఎవడు’, సిద్ధార్థ హీరోగా ‘అలామొదలైంది’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించడానికి సమంత అంగీకరించింది.

ఈ చిత్రాలతో పాటు ‘ఏమాయ చేసావె’ చిత్రం ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ‘ఏక్ దీవానా థా’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న సమంత తన డైరీని పూర్తిగా ఫుల్ చేసేసింది. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఈ చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేసుకోవడం సమంతకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరు చిత్రాలు అంగీకరించిన సమంత ఈ ఆరు చిత్రాల్లో ఏ చిత్రానికి ఎన్ని డేట్స్ కేటాయించాలో తేల్చుకోలేక ఇబ్బందిపడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment