Tuesday, October 25, 2011

భారత్‌ క్లీన్‌స్వీప్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ భారత్‌ 5-0 క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ను భారత గడ్డ మీద ఓడించడం అంతా సులువు కాదు. అన్ని ఇంగ్లాండ్‌కు మరో సారి స్పష్టం చేసింది. మంగళవారం జరిగిన ఐదవ, చివరి వన్డే మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌పై 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ జట్టు ఒక మార్పు జరిగింది. పార్థివ్‌ పటేల్‌ స్థానంలో మనోజ్‌ తివారి జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గంభీర్‌, రెహ్మన్‌ ఓపెనర్లుగా వచ్చారు. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 80 పరుగుల జోడించారు. గంభీర్‌ 46 బంతులల్లో నాలుగు బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి ఫిన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. రెహ్మన్‌ 61 బంతులల్లో 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. తివారి 24, రైనా 38, జాడేజ 21, అశ్విన్‌ 7, ప్రవీణ్‌ కుమార్‌ 16 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో పాటేల్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఫిన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 176 పరుగులు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్థసెంచరీతో నాటౌటుగా ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయం దిశగా పయనిస్తున్న సమయంలో అరోన్‌ కెప్టెన్‌ కుక్‌ను బౌల్డ్‌ చేశాడు.
కుక్‌ 61 బంతులల్లో ఎనిమిది ఫోర్ల సహయంతో 60 పరుగులు చేశాడు. క్విస్టర్‌ 63, బెల్‌ 2, ట్రాట్‌ 5, బైర్‌స్టవ్‌ 2, బోపార 4, బెన్‌సన్‌ 0, పటేల్‌ 18, ఫిన్‌ 1 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 129 పరుగుల వద్ద తొలి వికెటు కోల్పోయిన ఇంగ్లాండ్‌ మరో 49 పరుగులు జోడించి అలౌట్‌ అయ్యింది. భారత్‌ స్పినర్ల్‌ రవీంద్ర జడేజా 4/33 , రవీంద్ర అశ్విన్‌ 3/28 ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ను కుప్పకూలించారు. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్‌ వైట్‌వాష్‌ అయిన భారత్‌ సొంత గడ్డపై మళ్లీ క్లీన్‌స్వీప్‌ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

No comments:

Post a Comment