చిరంజీవి ఏకైక కుమారుడు రాంచరణ్ తేజకు అపోలో గ్రూపు సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు ఉపాసనతో తర్వలో వివాహం జరగనుంది. రెండు రోజుల్లో ఈ వివాహానికి సంబంధించిన ఇరు కుటుంబాలు ఉమ్మడి ప్రకటన చేయనున్నాయి. రాంచరణ్, ఉపాసన చైన్నెలో కలిసి చదువుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పెళ్లికి ఏర్పాట్లు చేసేందుకు చిరంజీవి సిద్దమవుతున్నారు. అపోలో గ్రూపు ఛైర్మన్ మనవరాలితో తన కుమారుడు రాంచరణ్ తేజ్కు వివాహం నిశ్చయం కానున్న విషయాన్ని చిరంజీవి నేడు ధ్రువీకరించాడు. ఈ ఏడాది నవంబర్లో నిశ్చితార్థం జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
No comments:
Post a Comment