వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను యువనేత వైఎస్ జగన్ శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద మధ్యాహ్నం 2.29 గంటల ప్రాంతంలో అశేష జనావళి సాక్షిగా జననేత జెండాను ఆవిష్కరించారు. ముందు నీలం మధ్యతో తెలుపు చివర ఆకుపచ్చ రంగుల్లో జెండా రూపొందించారు. జెండా మధ్యలో వైఎస్సార్ బొమ్మ పెట్టారు. బొమ్మ వెనుక కాషాయం రంగు ఉంది. బొమ్మ చుట్టూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందుపరిచారు. నీలం రండు యువ చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలుగా తీసుకున్నారు. పలువురు నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
No comments:
Post a Comment