Wednesday, February 23, 2011

నేడు అసలు మ్యాచ్‌ ప్రారంభం

 శనివారం ప్రారంభమైన పదవ ప్రపంచకప్‌లో సమరంలో నిన్నటి వరకు సాగిన మ్యాచులన్నీ ఏకపక్షంగా సాగాయి. బలమైన జట్లు, చిన్న జట్ల మధ్య సాగిన ఈ మ్యాచుల్లో సాధారణంగా బలమైన జట్లే గెలుస్తాయి. గెలిచాయి కూడా ఇప్పటిదాకా చప్పగా అనిపించిన ఈ టోర్నమెంటు నేటి పోరుతో ఊపందుకోనుంది. ఎందుకంటే ఆగ్రశ్రేణి జట్టుగా పేరు గాంచినా ఇంత వరకు కప్‌ గెలవని దక్షిణాఫ్రికా జట్టు. రెండు సార్లు ప్రపంచకప్‌ గెలుచుకున్న వెస్టిండీస్‌ జట్ల మధ్య నేడు ఫిరోజ్‌ షా కోట్ల మైధానంలో క్రికెట్‌ అభిమానులను అలరించే అసలు సిసలు సమరం జరగనుంది.

No comments:

Post a Comment