అక్కినేని నాగార్జున నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' ప్రారంభోత్సవం లాంఛనంగా శనివారంనాడు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...'సోషియోఫాంటసీ చేయాలనే చిన్నకోరిక ఉండేది. అది 'డమరుకం'తో తీరింది. రెండువేల సంవత్సరాలనాటి కథ. నేటికి ట్రావెల్ అవుతూ సాగుతుంది. ఇందులో నాలుగు గెటప్స్ ఉన్నాయి. 'హలోబ్రదర్'లో చేసిన మాస్ రోల్ ఇందులో చేస్తున్నా. ఏప్రిల్లో షూటింగ్లో పాల్గొంటా' అని చెప్పారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్.ఆర్.మూవీమేకర్స్లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్ హిట్ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్.ఆర్.మూవీమేకర్స్లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్ హిట్ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.
No comments:
Post a Comment