Tuesday, February 1, 2011

త్రిపాత్రాలో రజనీ ' రాణా '

 దక్షిణా భారత్‌ చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చాలాకాలం తరువాత త్రిపాత్రాభినయంతో వెండి తెరపై కన్పించబోతున్నారు. అభిమానుల్ని మెస్మరైజ్‌ చేయడానికి ' రాణా ' రూపంలో ఆయన రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. సింగిల్‌, డబుల్‌ రోల్స్‌తో బాక్సాఫీసుల్పీ బద్దలు కొట్టిన రజనీకాంత్‌ తాజాగా త్రిపాత్రాబియనం చేయడానికి అంగీకరించారు. ఈ చిత్రానికి రాణా అనే పేరును పెట్టారు. దీనిని అక్కర్‌ స్టూడియోస్‌, ఎరోస్‌ ాంటర్నేషనల్‌ మీడియా లిమిటెడ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. తమిళం, తెలుగు, హందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం ఘాటింగ్‌ మార్చిలో మొదలుకానున్నది. రజనీ కాంత్‌తో ముత్తు పడయప్ప ( నరసింహ ) వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని తీసిన ప్రముఖ దర్శకుడు కేఎస్‌రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నందున ప్రజల్లో అంచనాలు మరింత పెరగనున్నాయి. ' ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి ఛాయగ్రహం రత్నవేల్‌, ఎడిటింగ్‌ ఆంటోని అందించనున్నారు. అలాగే రజనీకాంత్‌ చిన్న కుమారై సౌందర్య ఈ చిత్రానికి టెక్నికల్‌ ఆండ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌గా వ్వవహరించనున్నారు. ఈ చిత్రాన్ని 2012 ఫిబ్రవరి లో విడుదల చేస్తారు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనేను ఎంపిక చేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment