Tuesday, August 31, 2010
స్పాట్ ఫిక్సింగ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫిక్సింగ్ వివాదంలో పాల్పడింది. ఇంగ్లండ్ జట్టుతో నాలుగు టెస్టుల సిరీస్లోని లార్డ్స్ టెస్టులో ఈ స్పాట్ ఫిక్సింగ్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ భట్తో సహా మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అమీర్, కీపర్ ఆక్మల్ ఈ వ్యవహరంలో దోషులుగా ఉన్నారు. వీరితో పాటు మరో ముగ్గురు క్రీడాకారులు కూడా సంబంధం ఉండి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. మహ్మద్ అసిఫ్, మహ్మద్ అమీర్ ఇద్దరు మజీద్ సూచనల మేరకు గురువారం, శుక్రవారం నాడు మూడు నోబాల్స్ వేస్తారని వెల్లడించింది. పాక్ బౌలర్లు ఉద్దేశపూర్వకంగానే మూడు నోబాల్స్ వేయాలని మజర్ పాకిస్తాన్ క్రీడాకారుల మధ్య రహస్య అంగీకారం కుదిరిందని పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
nee blog bagundi inka bachground
ReplyDeletemaristhe inke baguntundi